ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. త్వరలోనే ఏర్పాటు చేస్తానన్న ఏబీ వెంకటేశ్వరరావు..

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తన ఆలోచనలకు అనుగుణంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్థిక బలం సమకూర్చుకుంటున్నానని తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలు, భావాలు తెలియజేయొచ్చని ఆయన చెప్పారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం పిరికిదని విమర్శలు చేశారు. రాజధాని కోసం రెండో దశ భూసేకరణ ఎందుకని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. త్వరలోనే ఏర్పాటు చేస్తానన్న ఏబీ వెంకటేశ్వరరావు..
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తన ఆలోచనలకు అనుగుణంగా పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్థిక బలం సమకూర్చుకుంటున్నానని తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలు, భావాలు తెలియజేయొచ్చని ఆయన చెప్పారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం పిరికిదని విమర్శలు చేశారు. రాజధాని కోసం రెండో దశ భూసేకరణ ఎందుకని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.