కాంగ్రెస్ అధ్యక్షుడికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (83) అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఆయన చేరినట్లు సమాచారం. జ్వరం, కాలు నొప్పితో చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఖర్గే ఆరోగ్యంపై ఆయన కార్యాలయం, ఆస్పత్రి నుంచి హెల్త్ బులిటెన్ వెలువడే అవకాశం ఉంది. కాగా ఖర్గే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అక్టోబర్ 7న ఆయన చేపట్టిన నాగాలాండ్ పర్యటనపై సందిగ్ధం నెలకొంది.

కాంగ్రెస్ అధ్యక్షుడికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (83) అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఆయన చేరినట్లు సమాచారం. జ్వరం, కాలు నొప్పితో చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఖర్గే ఆరోగ్యంపై ఆయన కార్యాలయం, ఆస్పత్రి నుంచి హెల్త్ బులిటెన్ వెలువడే అవకాశం ఉంది. కాగా ఖర్గే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అక్టోబర్ 7న ఆయన చేపట్టిన నాగాలాండ్ పర్యటనపై సందిగ్ధం నెలకొంది.