ఢిల్లీలో బాంబు కలకలం: పార్లమెంటును పేల్చేస్తామంటూ వార్నింగ్.. ఏకకాలంలో 9 పాఠశాలలకు మెయిల్స్!

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు మెయిల్స్ కలకలం రేపాయి. మొత్తంగా తొమ్మిది పాఠశాలలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. బడులను పేల్చేస్తామంటూ హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా ఫిబ్రవరి 13వ తేదీన దేశ అత్యున్నత భవనం పార్లమెంటుపై కూడా దాడి చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయగా.. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్లను తీసుకెళ్లి మరీ తనిఖీలు చేపట్టారు. అలాగే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించి మరీ ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీలో బాంబు కలకలం: పార్లమెంటును పేల్చేస్తామంటూ వార్నింగ్.. ఏకకాలంలో 9 పాఠశాలలకు మెయిల్స్!
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు మెయిల్స్ కలకలం రేపాయి. మొత్తంగా తొమ్మిది పాఠశాలలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. బడులను పేల్చేస్తామంటూ హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా ఫిబ్రవరి 13వ తేదీన దేశ అత్యున్నత భవనం పార్లమెంటుపై కూడా దాడి చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయగా.. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్లను తీసుకెళ్లి మరీ తనిఖీలు చేపట్టారు. అలాగే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించి మరీ ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.