AP Telangana Water Dispute: రాయలసీమ లిఫ్ట్.. ఆగిందా, ఆపారా..!

'కృష్ణా నదికి వచ్చే నీళ్లు తక్కువ, అవసరాలు ఎక్కువ'.. ఇదే కదా తెలుగు రాష్ట్రాలు చెబుతున్నది. ఆ నీళ్ల వాటా 'మావంటే మావి' అని తగువులాడుకుంటున్నాయి రాష్ట్రాలు. ఈ ఇద్దరి కొట్లాటల మధ్య ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయో తెలుసా? అటుఇటుగా 650 టీఎంసీలు. ఒక్కోసారి వెయ్యి టీఎంసీల వరకు ఎవరికీ కాకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. అసలు.. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటానే 811 టీఎంసీలు. తాత్కాలికంగా తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చినా.. వాడుకుంటున్నది మాత్రం 116, 117 టీఎంసీలే. ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయ్. గట్టిగా వాడినా 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతోంది ఏపీ. పరిస్థితి ఇలా ఉంటే.. కృష్ణా నీటిని సమర్ధవంతంగా వాడుకునే పరిస్థితే లేదంటే.. ఆ ప్రాజెక్ట్‌ను ఆపండి, ఈ ప్రాజెక్టును నిలిపివేయండని అగ్గి రాజేసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై జరుగుతున్న రచ్చనే చూద్దాం. నేనే ఆపించానని సీఎం రేవంత్ అంటారు. మీరు ఆపింది కాదు.. తమ పోరాట ఫలితమే అంటోంది బీఆర్ఎస్. NGT ఆపమంది కాబట్టే ఆగిపోయింది అని చంద్రబాబు.. లేదూ సీఎం రేవంత్ అడగ్గానే చంద్రబాబు ఆపేశారని వైఎస్ జగన్. వీళ్లెవరూ కాదు.. ఆపిన ఘనత బీజేపీదేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్ ఆగిందా, ఆపారా, ఆపించారా? దీని చుట్టూ జరుగుతున్న రాజకీయాలేంటి?

AP Telangana Water Dispute: రాయలసీమ లిఫ్ట్.. ఆగిందా, ఆపారా..!
'కృష్ణా నదికి వచ్చే నీళ్లు తక్కువ, అవసరాలు ఎక్కువ'.. ఇదే కదా తెలుగు రాష్ట్రాలు చెబుతున్నది. ఆ నీళ్ల వాటా 'మావంటే మావి' అని తగువులాడుకుంటున్నాయి రాష్ట్రాలు. ఈ ఇద్దరి కొట్లాటల మధ్య ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయో తెలుసా? అటుఇటుగా 650 టీఎంసీలు. ఒక్కోసారి వెయ్యి టీఎంసీల వరకు ఎవరికీ కాకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. అసలు.. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిన వాటానే 811 టీఎంసీలు. తాత్కాలికంగా తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చినా.. వాడుకుంటున్నది మాత్రం 116, 117 టీఎంసీలే. ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయ్. గట్టిగా వాడినా 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతోంది ఏపీ. పరిస్థితి ఇలా ఉంటే.. కృష్ణా నీటిని సమర్ధవంతంగా వాడుకునే పరిస్థితే లేదంటే.. ఆ ప్రాజెక్ట్‌ను ఆపండి, ఈ ప్రాజెక్టును నిలిపివేయండని అగ్గి రాజేసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై జరుగుతున్న రచ్చనే చూద్దాం. నేనే ఆపించానని సీఎం రేవంత్ అంటారు. మీరు ఆపింది కాదు.. తమ పోరాట ఫలితమే అంటోంది బీఆర్ఎస్. NGT ఆపమంది కాబట్టే ఆగిపోయింది అని చంద్రబాబు.. లేదూ సీఎం రేవంత్ అడగ్గానే చంద్రబాబు ఆపేశారని వైఎస్ జగన్. వీళ్లెవరూ కాదు.. ఆపిన ఘనత బీజేపీదేనంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్ ఆగిందా, ఆపారా, ఆపించారా? దీని చుట్టూ జరుగుతున్న రాజకీయాలేంటి?