ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. రూటు మార్చారా!

ఆంధ్రప్రదేశ్‌లోని పలు కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపింది. అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు గురువారం మధ్యాహ్నం సమయంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే కోర్టులో బాంబు పెట్టారంటూ ఈ మెయిల్ వచ్చినట్లు అనంతపురం జిల్లా కోర్టు జడ్జి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే గతంలో రైల్వే స్టేషన్లు, బస్టాండులు, హోటళ్లకు బాంబు బెదిరింపులు రాగా.. ఈసారి కోర్టులకు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. రూటు మార్చారా!
ఆంధ్రప్రదేశ్‌లోని పలు కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపింది. అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు గురువారం మధ్యాహ్నం సమయంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే కోర్టులో బాంబు పెట్టారంటూ ఈ మెయిల్ వచ్చినట్లు అనంతపురం జిల్లా కోర్టు జడ్జి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే గతంలో రైల్వే స్టేషన్లు, బస్టాండులు, హోటళ్లకు బాంబు బెదిరింపులు రాగా.. ఈసారి కోర్టులకు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది.