ధాన్యం రైతులకు శుభవార్త.. రేపటి నుంచే (ఏప్రిల్ 4) ప్రారంభం.. గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు

ఏపీలోని ధాన్యం రైతులకు ముఖ్య గమనిక. శనివారం నుంచి ఏపీలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కావాల్సిన గోతాలు, లారీలను కూడా సిద్ధం చేశామని.. కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని తెలిపారు.

ధాన్యం రైతులకు శుభవార్త.. రేపటి నుంచే (ఏప్రిల్ 4) ప్రారంభం.. గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు
ఏపీలోని ధాన్యం రైతులకు ముఖ్య గమనిక. శనివారం నుంచి ఏపీలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కావాల్సిన గోతాలు, లారీలను కూడా సిద్ధం చేశామని.. కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని తెలిపారు.