"భారత్‌తో మా బంధం అత్యంత దృఢం": ఇండియా నౌకలపై కాల్పుల తర్వాత ఇరాన్

హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పులతో ఇటు భారత్‌తో పాటు అటు ఇరాన్‌లో అధికారుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. ముఖ్యంగా ఇండియాకు చెందిన రెండు నౌకలపై ఐఆర్‌జీసీ గన్‌ బోట్‌లు కాల్పులు జరిపాయి. అయితే ఈ దాడుల్లో ట్యాంకర్లకు గానీ.. ఆ నౌకల్లో ఉన్న సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాలేవు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. భారత్‌లోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చింది. ఈక్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజిద్ హకీమ్ ఇలాహి భారత్‌తో తమ బంధం బలంగా ఉందని చెప్పారు.

హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పులతో ఇటు భారత్‌తో పాటు అటు ఇరాన్‌లో అధికారుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. ముఖ్యంగా ఇండియాకు చెందిన రెండు నౌకలపై ఐఆర్‌జీసీ గన్‌ బోట్‌లు కాల్పులు జరిపాయి. అయితే ఈ దాడుల్లో ట్యాంకర్లకు గానీ.. ఆ నౌకల్లో ఉన్న సిబ్బందికి గానీ ఎలాంటి గాయాలు కాలేవు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. భారత్‌లోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చింది. ఈక్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజిద్ హకీమ్ ఇలాహి భారత్‌తో తమ బంధం బలంగా ఉందని చెప్పారు.