గంట పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు.. ఆ అంశంపైనా ప్రధానంగా చర్చ!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించిన చంద్రబాబు.. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మరోవైపు అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ పర్యటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలిసింది.

గంట పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు.. ఆ అంశంపైనా ప్రధానంగా చర్చ!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించిన చంద్రబాబు.. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మరోవైపు అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ పర్యటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలిసింది.