ఏఐ థీమ్‌తో దుర్గా మండపం.. చూడటానికి రెండు కళ్లూ చాలవు!

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా వివిధ ఆకారాల్లో పలుచోట్ల మండపాలను ఏర్పాటుచేశారు. ఇలాంటి వాటిలో కొన్ని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దసరా పండుగ, దుర్గామాత మండపాలకు బెంగాల్‌ పెట్టింది పేరు. బెంగాలీలకు ఇది రాష్ట్ర పండగ. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీ థీమ్‌తో బెంగాల్‌లో దుర్గామాత మండపం వేశారు. ప్రస్తుతం ఈ మండపం అలరిస్తుంది. ఏఐ ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకొచ్చిందని నిర్వహకులు చెబుతున్నారు. ఉత్తర కోల్‌కతా జగత్‌ ముఖర్జీ పార్క్‌లో ఏర్పాటుచేసిన ఈ మండపం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. మారుతున్న డిజిటల్‌ సాంకేతికతను ప్రతిబింబించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. కంప్యూటర్‌ కీబోర్డులను సైతం ఇందుకు వినియోగించారు. విద్యుత్‌ కాంతులతో ఐటీ కంపెనీల భవనాలను తలపించేలా ఉంది. అలాగే, దేశంలోనే అత్యంత ఖరీదైన దుర్గా మండపాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఏర్పాటుచేశారు. ఈ మండపం కోసం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేయడం విశేషం.

ఏఐ థీమ్‌తో దుర్గా మండపం.. చూడటానికి రెండు కళ్లూ చాలవు!
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా వివిధ ఆకారాల్లో పలుచోట్ల మండపాలను ఏర్పాటుచేశారు. ఇలాంటి వాటిలో కొన్ని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దసరా పండుగ, దుర్గామాత మండపాలకు బెంగాల్‌ పెట్టింది పేరు. బెంగాలీలకు ఇది రాష్ట్ర పండగ. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీ థీమ్‌తో బెంగాల్‌లో దుర్గామాత మండపం వేశారు. ప్రస్తుతం ఈ మండపం అలరిస్తుంది. ఏఐ ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకొచ్చిందని నిర్వహకులు చెబుతున్నారు. ఉత్తర కోల్‌కతా జగత్‌ ముఖర్జీ పార్క్‌లో ఏర్పాటుచేసిన ఈ మండపం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. మారుతున్న డిజిటల్‌ సాంకేతికతను ప్రతిబింబించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. కంప్యూటర్‌ కీబోర్డులను సైతం ఇందుకు వినియోగించారు. విద్యుత్‌ కాంతులతో ఐటీ కంపెనీల భవనాలను తలపించేలా ఉంది. అలాగే, దేశంలోనే అత్యంత ఖరీదైన దుర్గా మండపాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఏర్పాటుచేశారు. ఈ మండపం కోసం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేయడం విశేషం.