ఏనుగుల మందను ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు.. పట్టాలు తప్పిన 5 బోగీలు

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సైరాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ హొజాయ్ జిల్లాలో ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు చెల్లాచెదురుగా పడి ప్రాణాలు వదలడం అక్కడి వారిని కలచివేసింది. ప్రమాద ధాటికి రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తూ వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. రైలు పట్టాలపై ఏనుగుల మారణహోమం మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చింది.

ఏనుగుల మందను ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు.. పట్టాలు తప్పిన 5 బోగీలు
అస్సాంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సైరాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ హొజాయ్ జిల్లాలో ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు చెల్లాచెదురుగా పడి ప్రాణాలు వదలడం అక్కడి వారిని కలచివేసింది. ప్రమాద ధాటికి రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తూ వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. రైలు పట్టాలపై ఏనుగుల మారణహోమం మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చింది.