తెలంగాణ ఉద్యోగులకు సంక్రాంతి కానుక.. డీఏపై సీఎం కీలక ప్రకటన..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (DA) మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 227 కోట్ల అదనపు భారం పడినప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ ఫైలుపై సంతకం చేసినట్లు సీఎం తెలిపారు. అలాగే ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజనను సవరించేందుకు రిటైర్డ్ అధికారులతో కమిటీ వేస్తామని, ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తూ ఉద్యోగులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యోగులకు సంక్రాంతి కానుక.. డీఏపై సీఎం కీలక ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (DA) మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 227 కోట్ల అదనపు భారం పడినప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ ఫైలుపై సంతకం చేసినట్లు సీఎం తెలిపారు. అలాగే ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజనను సవరించేందుకు రిటైర్డ్ అధికారులతో కమిటీ వేస్తామని, ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తూ ఉద్యోగులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.