ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనకు బ్రేక్.. ఢిల్లీ పొగమంచే కారణం, ఎలాగంటే?

దేశ రాజధాని ఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న సీజన్ తొలి పొగమంచు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు ఆటంకం కలిగించింది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం సోమవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరాల్సిన మోదీ విమానం.. ఐజీఐ విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ కారణంగా ఆలస్యం అయింది. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో విమాన కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి.

ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనకు బ్రేక్.. ఢిల్లీ పొగమంచే కారణం, ఎలాగంటే?
దేశ రాజధాని ఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న సీజన్ తొలి పొగమంచు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు ఆటంకం కలిగించింది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం సోమవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరాల్సిన మోదీ విమానం.. ఐజీఐ విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ కారణంగా ఆలస్యం అయింది. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో విమాన కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి.