బీటెక్ మూడో ఏడాది మానేస్తే బీఎస్సీ డిగ్రీ.. విద్యార్థులకు మద్రాస్ ఐఐటీ బంపరాఫర్

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటి అయిన ఐఐటీ మద్రాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఐఐటీలో చేరిన బీటెక్ విద్యార్థులు మూడేళ్ల తర్వాత 250 క్రెడిట్లు సాధిస్తే బీఎస్సీ డిగ్రీతో బయటకు వెళ్లొచ్చు. 2024 బ్యాచ్ నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. విద్యార్థుల భారాన్ని తగ్గించేందుకు, మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఈ మార్పులు చేశారు. ఈ డిగ్రీ ఉన్నత విద్య, సివిల్స్ వంటి వాటికి ఇది దోహదపడుతుంది.

బీటెక్ మూడో ఏడాది మానేస్తే బీఎస్సీ డిగ్రీ.. విద్యార్థులకు మద్రాస్ ఐఐటీ బంపరాఫర్
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటి అయిన ఐఐటీ మద్రాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఐఐటీలో చేరిన బీటెక్ విద్యార్థులు మూడేళ్ల తర్వాత 250 క్రెడిట్లు సాధిస్తే బీఎస్సీ డిగ్రీతో బయటకు వెళ్లొచ్చు. 2024 బ్యాచ్ నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. విద్యార్థుల భారాన్ని తగ్గించేందుకు, మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఈ మార్పులు చేశారు. ఈ డిగ్రీ ఉన్నత విద్య, సివిల్స్ వంటి వాటికి ఇది దోహదపడుతుంది.