మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. ఇక నుంచి ఇద్దరు ఎమ్మార్వోలు..

తెలంగాణలోని అధిక జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పరిపాలనను వేగవంతం చేసేందుకు అదనపు తహశీల్దార్లను (MRO) నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. లక్షన్నర నుండి రెండు లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో ఒకే ఎమ్మార్వోపై పనిభారం ఎక్కువగా ఉన్నందున, త్వరలోనే కేబినెట్ ఆమోదంతో అదనపు అధికారులను కేటాయిస్తామని తెలిపారు. పెద్దపల్లిలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిందని, పేదల ఇళ్ల గురించి పట్టించుకోలేదని విమర్శించారు.

మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. ఇక నుంచి ఇద్దరు ఎమ్మార్వోలు..
తెలంగాణలోని అధిక జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పరిపాలనను వేగవంతం చేసేందుకు అదనపు తహశీల్దార్లను (MRO) నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. లక్షన్నర నుండి రెండు లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో ఒకే ఎమ్మార్వోపై పనిభారం ఎక్కువగా ఉన్నందున, త్వరలోనే కేబినెట్ ఆమోదంతో అదనపు అధికారులను కేటాయిస్తామని తెలిపారు. పెద్దపల్లిలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిందని, పేదల ఇళ్ల గురించి పట్టించుకోలేదని విమర్శించారు.