సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ కానుక.. వాటి కోసం రూ.30 వేల చొప్పున.. రూ.33 కోట్లు కేటాయింపు..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 7,000 చర్చిలకు పండుగ నిధుల కింద మొత్తం 33 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రతి చర్చికి 30 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న సీఎం, డిసెంబర్ నెల కాంగ్రెస్ పార్టీకి మరియు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదని గుర్తు చేశారు. ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో ప్రజా పాలన సాగిస్తున్నామని.. మత విద్వేషాలను అరికట్టేందుకు త్వరలోనే హేట్ స్పీచ్ చట్టాన్ని తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ కానుక.. వాటి కోసం రూ.30 వేల చొప్పున.. రూ.33 కోట్లు కేటాయింపు..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 7,000 చర్చిలకు పండుగ నిధుల కింద మొత్తం 33 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రతి చర్చికి 30 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న సీఎం, డిసెంబర్ నెల కాంగ్రెస్ పార్టీకి మరియు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదని గుర్తు చేశారు. ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో ప్రజా పాలన సాగిస్తున్నామని.. మత విద్వేషాలను అరికట్టేందుకు త్వరలోనే హేట్ స్పీచ్ చట్టాన్ని తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.