రైలు ప్రయాణీకులకు షాక్: లగేజీపై అదనపు ఛార్జీలు.. 35 కేజీలు దాటితే ఎంత కట్టాలంటే?

రైలు ప్రయాణంలో ఇష్టమొచ్చినంత లగేజీ తీసుకెళ్లే రోజులకు కాలం చెల్లింది. ఇకపై రైలు పెట్టెల్లో భారీ బ్యాగులు, పెద్ద పెట్టెలతో ప్రయాణిస్తే జేబు ఖాళీ అవ్వాల్సిందేనని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సాక్షిగా రైల్వే లగేజీ నిబంధనలపై కీలక వివరాలు వెల్లడించిన ఆయన.. నిర్ణీత పరిమితి దాటిన ప్రతి కిలోకు 1.5 రెట్లు అదనపు బాదుడు తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా స్లీపర్, జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారు 35 నుంచి 40 కిలోల లోపు మాత్రమే ఉచితంగా తీసుకెళ్లాలని.. అంతకు మించితే ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు.

రైలు ప్రయాణీకులకు షాక్: లగేజీపై అదనపు ఛార్జీలు.. 35 కేజీలు దాటితే ఎంత కట్టాలంటే?
రైలు ప్రయాణంలో ఇష్టమొచ్చినంత లగేజీ తీసుకెళ్లే రోజులకు కాలం చెల్లింది. ఇకపై రైలు పెట్టెల్లో భారీ బ్యాగులు, పెద్ద పెట్టెలతో ప్రయాణిస్తే జేబు ఖాళీ అవ్వాల్సిందేనని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సాక్షిగా రైల్వే లగేజీ నిబంధనలపై కీలక వివరాలు వెల్లడించిన ఆయన.. నిర్ణీత పరిమితి దాటిన ప్రతి కిలోకు 1.5 రెట్లు అదనపు బాదుడు తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా స్లీపర్, జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారు 35 నుంచి 40 కిలోల లోపు మాత్రమే ఉచితంగా తీసుకెళ్లాలని.. అంతకు మించితే ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు.