రేషన్ లబ్ధిదారులకు.. అలా చేస్తున్నట్లయితే కార్డులు రద్దు, 1.40 లక్షల కార్డులపై వేటు..!

తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లిస్తూ.. ఖరీదైన వాహనాలు, 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండి కూడా ఉచిత రేషన్ పొందుతున్న వారి కార్డులను తొలగించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఆధార్, పాన్ కార్డుల అనుసంధానంతో లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల కార్డులను తొలగించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా సంక్షేమ పథకాలు పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసి, లబ్ధిదారుల జాబితాను ప్రక్షాళన చేయాలని కేంద్రం రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది.

రేషన్ లబ్ధిదారులకు.. అలా చేస్తున్నట్లయితే కార్డులు రద్దు, 1.40 లక్షల కార్డులపై వేటు..!
తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లిస్తూ.. ఖరీదైన వాహనాలు, 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండి కూడా ఉచిత రేషన్ పొందుతున్న వారి కార్డులను తొలగించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఆధార్, పాన్ కార్డుల అనుసంధానంతో లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల కార్డులను తొలగించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా సంక్షేమ పథకాలు పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసి, లబ్ధిదారుల జాబితాను ప్రక్షాళన చేయాలని కేంద్రం రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది.