ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. తందూరీ వంటకాలపై నిషేధం.. కారణం ఇదే!

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశ రాజధాని ఢిల్లీలో తందూరీ వంటకాలు తయారు చేయడంపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ ప్రమాదకరమైన స్థాయిని మించి నమోదవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. తందూరీ వంటకాలు తయారు చేసేందుకు బొగ్గు, కట్టెలు ఉపయోగిస్తుండటంతో ఢిల్లీ సర్కార్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఢిల్లీ హోటల్ యజమానులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో కొందరు మెనూ మార్చుతుండగా.. మరికొందరు తందూరీ విధానాలను మార్చేస్తున్నారు.

ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. తందూరీ వంటకాలపై నిషేధం.. కారణం ఇదే!
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశ రాజధాని ఢిల్లీలో తందూరీ వంటకాలు తయారు చేయడంపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ ప్రమాదకరమైన స్థాయిని మించి నమోదవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. తందూరీ వంటకాలు తయారు చేసేందుకు బొగ్గు, కట్టెలు ఉపయోగిస్తుండటంతో ఢిల్లీ సర్కార్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఢిల్లీ హోటల్ యజమానులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో కొందరు మెనూ మార్చుతుండగా.. మరికొందరు తందూరీ విధానాలను మార్చేస్తున్నారు.