గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం: థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు వచ్చిన లూత్రా సోదరులు

గోవాలోని నైట్‌క్లబ్‌ అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 25 మంది మరణానికి కారణమైన క్లబ్ యజమానులు.. గౌరవ్, సౌరభ్‌ లూత్రాలు థాయ్‌లాండ్‌లో దాక్కోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ సోదరులను మంగళవారం ఉదయం థాయ్‌లాండ్‌ పోలీసులు భారత్‌కు పంపించారు. ఇండిగో విమానం ద్వారా తరలించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వీరు ఢిల్లీకి చేరుకోగా.. పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం రోజు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం: థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు వచ్చిన లూత్రా సోదరులు
గోవాలోని నైట్‌క్లబ్‌ అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 25 మంది మరణానికి కారణమైన క్లబ్ యజమానులు.. గౌరవ్, సౌరభ్‌ లూత్రాలు థాయ్‌లాండ్‌లో దాక్కోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ సోదరులను మంగళవారం ఉదయం థాయ్‌లాండ్‌ పోలీసులు భారత్‌కు పంపించారు. ఇండిగో విమానం ద్వారా తరలించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వీరు ఢిల్లీకి చేరుకోగా.. పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం రోజు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.