ఎంతటి విషాదం.. ప్రసవం కోసం కొండల గుండా 6 కి.మీ నడిచిన నిండు గర్భిణీ, ఆసుపత్రికి చేరేలోపే పోయిన ప్రాణం

భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నామని చెప్పుకుంటున్న వేళ.. మారుమూల గిరిజన పల్లెల్లో నేటికీ ప్రాథమిక సౌకర్యాలు లేక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. తన గ్రామానికి సరైన రహదారి సౌకర్యం, అంబులెన్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఒక నిండు గర్భిణి ప్రసవ వేదనను భరిస్తూనే ఏకంగా 6 కిలో మీటర్లు కాలి నడకన ప్రయాణించాల్సి వచ్చింది. ప్రాణాలను పణంగా పెట్టి ఆసుపత్రికి చేరుకుని బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ.. ఆ తల్లిని మృత్యువు కబళించింది.

ఎంతటి విషాదం.. ప్రసవం కోసం కొండల గుండా 6 కి.మీ నడిచిన నిండు గర్భిణీ, ఆసుపత్రికి చేరేలోపే పోయిన ప్రాణం
భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నామని చెప్పుకుంటున్న వేళ.. మారుమూల గిరిజన పల్లెల్లో నేటికీ ప్రాథమిక సౌకర్యాలు లేక నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. తన గ్రామానికి సరైన రహదారి సౌకర్యం, అంబులెన్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఒక నిండు గర్భిణి ప్రసవ వేదనను భరిస్తూనే ఏకంగా 6 కిలో మీటర్లు కాలి నడకన ప్రయాణించాల్సి వచ్చింది. ప్రాణాలను పణంగా పెట్టి ఆసుపత్రికి చేరుకుని బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ.. ఆ తల్లిని మృత్యువు కబళించింది.