ఎన్నికల వేళ బెంగాల్‌కు వరం.. ఈనెల 17న తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణం మరికొన్ని రోజుల్లోనే సాకారం కానుంది. దేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈనెల 17వ తేదీన పట్టాలెక్కనుంది. జనవరి 17న హౌరా-గువహటి మార్గంలో ప్రధాని మోదీ ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఇలాంటి మరో 12 రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం వరం ప్రకటించినట్లయింది.

ఎన్నికల వేళ బెంగాల్‌కు వరం.. ఈనెల 17న తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణం మరికొన్ని రోజుల్లోనే సాకారం కానుంది. దేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈనెల 17వ తేదీన పట్టాలెక్కనుంది. జనవరి 17న హౌరా-గువహటి మార్గంలో ప్రధాని మోదీ ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఇలాంటి మరో 12 రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం వరం ప్రకటించినట్లయింది.