చంద్రగిరి @ 752 అర్జీలు

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘రెవెన్యూ క్లినిక్‌’ తీసుకొచ్చింది. పీజీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా ఏర్పాటు చేసింది. జిల్లాలో తొలిసారిగా గురువారం చంద్రగిరి నియోజకవర్గంతో ఈ కార్యక్రమం మొదలైంది. వివిధ భూ సమస్యలపై 752 అర్జీలు అందాయి. ఉదయం 9.30 గంటలకే నియోజకవర్గం నుంచి అర్జీదారులు బారులు తీరారు. దరఖాస్తులకోసం జనం ఎగబడటంతో వీటిని ఇచ్చేందుకు కలెక్టరేట్‌ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచి పీజీఆర్‌ఎస్‌ హాల్‌ వరకు భూసమస్యలపై వచ్చిన అర్జీదారులతో నిండిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్‌ రాత్రి 7.30గంటల వరకు సాగింది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఇన్‌ఛార్జి జేసీ మౌర్య, డీఆర్వో నరసింహులు, ఎస్‌డీసీలు రోజ్మాండ్‌, దేవేంద్రరెడ్డి, ఆర్డీవో రామ్మోహన్‌, కలెక్టరేట్‌ సిబ్బంది, ఆయా మండలాల తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్వోలు అర్జీలు స్వీకరించారు. ఏ సమస్య ఎపుడు పరిష్కారం అవుతుంతో నిర్దిష్ట సమయం ఇచ్చారు. ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి అర్జీదారులతో కలెక్టర్‌ మాట్లాడారు. వారి సమస్యలను విన్నారు. 20 మంది అర్జీదారులకు తక్షణ పరిష్కారం చూపారు. నియోజకవర్గంలోని 8మంది లబ్ధిదారుల (సుమారు 24ఎకరాలు) భూములను 22ఏ నుంచి తొలగించి అప్పటికప్పుడు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఇంటిస్థలాలు కావాలని తిరుగుతున్న వారికి ఖాళీ లేఅవుట్లలో ఇంటిస్థలాల ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఇన్నేళ్ల సమస్య పరిష్కారం కావడంతో 20మంది లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. మిగతా వాటినీ ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు.

చంద్రగిరి @ 752 అర్జీలు
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘రెవెన్యూ క్లినిక్‌’ తీసుకొచ్చింది. పీజీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా ఏర్పాటు చేసింది. జిల్లాలో తొలిసారిగా గురువారం చంద్రగిరి నియోజకవర్గంతో ఈ కార్యక్రమం మొదలైంది. వివిధ భూ సమస్యలపై 752 అర్జీలు అందాయి. ఉదయం 9.30 గంటలకే నియోజకవర్గం నుంచి అర్జీదారులు బారులు తీరారు. దరఖాస్తులకోసం జనం ఎగబడటంతో వీటిని ఇచ్చేందుకు కలెక్టరేట్‌ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచి పీజీఆర్‌ఎస్‌ హాల్‌ వరకు భూసమస్యలపై వచ్చిన అర్జీదారులతో నిండిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్‌ రాత్రి 7.30గంటల వరకు సాగింది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఇన్‌ఛార్జి జేసీ మౌర్య, డీఆర్వో నరసింహులు, ఎస్‌డీసీలు రోజ్మాండ్‌, దేవేంద్రరెడ్డి, ఆర్డీవో రామ్మోహన్‌, కలెక్టరేట్‌ సిబ్బంది, ఆయా మండలాల తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్వోలు అర్జీలు స్వీకరించారు. ఏ సమస్య ఎపుడు పరిష్కారం అవుతుంతో నిర్దిష్ట సమయం ఇచ్చారు. ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి అర్జీదారులతో కలెక్టర్‌ మాట్లాడారు. వారి సమస్యలను విన్నారు. 20 మంది అర్జీదారులకు తక్షణ పరిష్కారం చూపారు. నియోజకవర్గంలోని 8మంది లబ్ధిదారుల (సుమారు 24ఎకరాలు) భూములను 22ఏ నుంచి తొలగించి అప్పటికప్పుడు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఇంటిస్థలాలు కావాలని తిరుగుతున్న వారికి ఖాళీ లేఅవుట్లలో ఇంటిస్థలాల ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఇన్నేళ్ల సమస్య పరిష్కారం కావడంతో 20మంది లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. మిగతా వాటినీ ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు.