సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో 14 మంది నక్సలైట్లు మృతి!

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కోటలు బద్దలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన 2026 మార్చి గడువు సమీపిస్తున్న తరుణంలో.. భద్రతా దళాలు మావోయిస్టులపై నిర్ణయాత్మక పోరును ఉధృతం చేశాయి. శనివారం తెల్లవారుజామున సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు మెరుపు దాడుల్లో ఏకంగా 14 మంది నక్సలైట్లు హతమయ్యారు. ముఖ్యంగా సుక్మాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కొంటా ఏరియా కమిటీ సెక్రటరీ మంగ్దూతో పాటు ఆ కమిటీలోని సాయుధ దళమంతా తుడిచి పెట్టుకుపోవడం భద్రతా దళాల అతిపెద్ద వ్యూహాత్మక విజయంగా నిలిచింది.

సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో 14 మంది నక్సలైట్లు మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కోటలు బద్దలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన 2026 మార్చి గడువు సమీపిస్తున్న తరుణంలో.. భద్రతా దళాలు మావోయిస్టులపై నిర్ణయాత్మక పోరును ఉధృతం చేశాయి. శనివారం తెల్లవారుజామున సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు మెరుపు దాడుల్లో ఏకంగా 14 మంది నక్సలైట్లు హతమయ్యారు. ముఖ్యంగా సుక్మాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కొంటా ఏరియా కమిటీ సెక్రటరీ మంగ్దూతో పాటు ఆ కమిటీలోని సాయుధ దళమంతా తుడిచి పెట్టుకుపోవడం భద్రతా దళాల అతిపెద్ద వ్యూహాత్మక విజయంగా నిలిచింది.