సుప్రీం కోర్టులో తెలంగాణకు భారీ ఊరట.. ఆ రూ.15వేల కోట్ల విలువ చేసే భూములు తెలంగాణకు చెందినవే..

హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, సాహెబ్‌నగర్ వద్ద గల 102 ఎకరాల ఖరీదైన భూమిపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన ఈ భూమి పూర్తిగా తెలంగాణ అటవీశాఖకే చెందుతుందని స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా నిజాం వారసులమని చెప్పుకునే ప్రైవేటు వ్యక్తులతో సాగుతున్న ఈ భూ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తెరదించింది. గతంలో వీరికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వచ్చే ఎనిమిది వారాల్లో ఈ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

సుప్రీం కోర్టులో తెలంగాణకు భారీ ఊరట.. ఆ రూ.15వేల కోట్ల విలువ చేసే భూములు తెలంగాణకు చెందినవే..
హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురం, సాహెబ్‌నగర్ వద్ద గల 102 ఎకరాల ఖరీదైన భూమిపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన ఈ భూమి పూర్తిగా తెలంగాణ అటవీశాఖకే చెందుతుందని స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా నిజాం వారసులమని చెప్పుకునే ప్రైవేటు వ్యక్తులతో సాగుతున్న ఈ భూ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తెరదించింది. గతంలో వీరికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. వచ్చే ఎనిమిది వారాల్లో ఈ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.