తెల్లవారుజామునే అస్సాంను వణికించిన భూకంపం.. 5.1 తీవ్రతతో ప్రకంపనలు, భయంతో రోడ్లపైకి ప్రజలు

ఈశాన్య భారతం సోమవారం తెల్లవారుజామున వరుస భూకంపాలతో ఉలిక్కిపడింది. అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో గంట వ్యవధిలోనే భూమి కంపించడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. తొలుత త్రిపురలోని గోమతిలో 3.9 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. ఆ వెంటనే అస్సాంలోని మోరిగావ్ కేంద్రంగా 5.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులు, మంచాలు కదలడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లోని దాదాపు 17 జిల్లాలపై ఈ ప్రభావం పడింది.

తెల్లవారుజామునే అస్సాంను వణికించిన భూకంపం.. 5.1 తీవ్రతతో ప్రకంపనలు, భయంతో రోడ్లపైకి ప్రజలు
ఈశాన్య భారతం సోమవారం తెల్లవారుజామున వరుస భూకంపాలతో ఉలిక్కిపడింది. అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో గంట వ్యవధిలోనే భూమి కంపించడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. తొలుత త్రిపురలోని గోమతిలో 3.9 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. ఆ వెంటనే అస్సాంలోని మోరిగావ్ కేంద్రంగా 5.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులు, మంచాలు కదలడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లోని దాదాపు 17 జిల్లాలపై ఈ ప్రభావం పడింది.